హైదరాబాద్,మార్చి 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం కడప జిల్లా ఇడుపులపాయ లోఆవిష్కరించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద మధ్యాహ్నం 2.29 గంటల ప్రాంతంలో అశేష జనావళి సాక్షిగా జెండాను ఆవిష్కరించారు. ముందు నీలం, మధ్యలో తెలుపు ,చివర ఆకుపచ్చ రంగుల్లో జెండా రూపొందించారు. జెండా మధ్యలో వైఎస్సార్ బొమ్మ పెట్టారు. బొమ్మ వెనుక కాషాయం రంగు ఉంది. బొమ్మ చుట్టూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందుపరిచారు. నీలం రంగు యువ చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలుగా తీసుకున్నారు. జెండా ఆవిష్కరణకార్యక్రమానికి జగన్తో పాటు ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి
ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు అమనాథ్రెడ్డి, మేకపాటి చంద్రమోహన్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివప్రసాద్రెడ్డి, రామచంద్రారెడ్డి, బాబూరావు, శోభానాగిరెడ్డి,కాటసాని రామిరెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామకృష్ణ, కొండా సురేఖ, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, భూమా నాగిరెడ్డి, అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, లేళ్ల అప్పిరెడ్డి, విజయభాస్కరరెడ్డి, నాగార్జున, గోపాల్రెడ్డి, పూడి పుల్లారెడ్డి, కుంభా రావిబాబు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు కూడా హాజరయ్యారు.
No comments:
Post a Comment