హైదరాబాద్,మార్చి 8 : ఈనెల 10వ తేదీన తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన మిలియన్ మార్చ్ కు అనుమతి నిరాకరించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. మిలియన్ మార్చ్ పై ప్రొఫెసర్ కోదండరామ్ సమాచారం ఇచ్చారే కానీ తమను అనుమతి కోరలేదన్నారు. మార్చ్ లో చట్టసమ్మతం కాని అంశాలు ఉన్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇతరులకు సమస్యలు సృష్టించకుండా మిలియన్ మార్చ్ నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. బందోబస్తు కోసం అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు ఏకేఖాన్ తెలిపారు. సామాన్య ప్రజల రక్షణ కోసం తాము తీసుకోవాల్సి జాగ్రత్తలు తాము తీసుకుంటామన్నారు.
పరిక్షలు యథాతథం
కాగా, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ‘మిలియన్ మార్చ్’ ఆందోళన సమయాన్ని మార్చడంతో ఆరోజు నిర్వహించాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. పదిన జరపతలపెట్టిన ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్-2 పేపర్ పరీక్ష ఉదయం 8 నుంచి 11 వరకు పరీక్ష ఉండటం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం లేదన్నారు. సీబీఎస్ఈ బోర్డు నిర్వహించే సోషల్ సైన్స్ పరీక్ష కూడా యథాతథంగా ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇది ఉదయం 10.30కు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తవుతుంది.
శాంతియుతంగానే మిలియన్ మార్చ్ | |
|
No comments:
Post a Comment