Saturday, March 5, 2011

షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్,మార్చి 5: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి పార్ధసారధి తెలిపారు. అన్ని జిల్లాలలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. కాగా, రంగారెడ్డి , హైదరాబాద్ లలో మిలియన్ మార్చ్ కారణంగా ఈ నెల 10వ తేదీన పరీక్ష నిర్వహించాలా? వద్దా? అనే విషయం టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడి  నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇలా వుండగా,  మిలియన్ మార్చ్, వివిధ పరీక్షల నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు శాసన సభ పరిసర ప్రాంతాలలో ఆంక్షలు విధించారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు.
టెన్త్, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఈనెల 25వ తేదీ వరకు 144వ సెక్షన్ విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.ఖాన్ చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...