Monday, March 21, 2011

లిబియాపై దాడుల్లో 64 మంది మృతి


ట్రిపోలీ,మార్చి 21: : యూరోపియన్ దేశాల, అమెరికా దేశాల సైన్యాలు జరిపిన దాడిలో సుమారు 64 మంది మరణించారని ఆదివారం లిబియా ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరో 150 మంది గాయాల పాలయ్యారని లిబియా టెలివిజన్ అల్ అరేబియా తెలిపింది. ఫ్రెంచ్ ఫైటర్ జెట్‌తో లిబియాపై తొలి దాడిని నిర్వహించారు. ఈ దాడుల్లో లిబియన్ మిలటరీ వాహనాలు ధ్వంసమయ్యాయి. అమెరికా, ఫ్రెంచ్ దళాలు జరిపిన దాడుల్లో సిర్తే, బెంఘాజీ, మిస్రతా, జువారా ప్రాంతాలు దెబ్బతిన్నట్టు లిబియా టెలివిజన్ ప్రసారం చేసింది. అయితే లిబియన్ వ్యతిరేక దళాలపై రసాయనిక ఆయుధాల దాడిని ఆపివేయాలని సంకీర్ణదళాలు హెచ్చరించాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...