లిబియాపై దాడుల్లో 64 మంది మృతి


ట్రిపోలీ,మార్చి 21: : యూరోపియన్ దేశాల, అమెరికా దేశాల సైన్యాలు జరిపిన దాడిలో సుమారు 64 మంది మరణించారని ఆదివారం లిబియా ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరో 150 మంది గాయాల పాలయ్యారని లిబియా టెలివిజన్ అల్ అరేబియా తెలిపింది. ఫ్రెంచ్ ఫైటర్ జెట్‌తో లిబియాపై తొలి దాడిని నిర్వహించారు. ఈ దాడుల్లో లిబియన్ మిలటరీ వాహనాలు ధ్వంసమయ్యాయి. అమెరికా, ఫ్రెంచ్ దళాలు జరిపిన దాడుల్లో సిర్తే, బెంఘాజీ, మిస్రతా, జువారా ప్రాంతాలు దెబ్బతిన్నట్టు లిబియా టెలివిజన్ ప్రసారం చేసింది. అయితే లిబియన్ వ్యతిరేక దళాలపై రసాయనిక ఆయుధాల దాడిని ఆపివేయాలని సంకీర్ణదళాలు హెచ్చరించాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు