610 జిఓ అమలుకు ప్రత్యేక కమిటీ
హైదరాబాద్,మార్చి 21: ఉద్యోగ నియామకాలలో తెలంగాణ ప్రాంత అభ్యర్థుల వాటాకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నలుగురు సభ్యులతో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. 610 జిఓ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
Comments