నాగపూర్,మార్చి 13: ప్రపంచకప్లో భాగంగా శనివారమిక్కడ జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ పై విజయయం సాధించి గ్రూప్ 'బి ' లో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటయింది. ఒక దశలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లిన టీమిండియాకు పదునైన బౌలింగ్తో సఫారీలు కళ్లెం వేశారు. 30 పరుగుల తేడాతో 8 వికెట్లు పడగొట్టారు. సచిన్ 111, సెహ్వాగ్ 73, గంభీర్ 69 మాత్రమే రాణించారు. యువరాజ్ 12, కొహ్లి1, హర్భజన్ 3 పరుగులు చేసి అవుటయ్యారు. పఠాన్, జహీర్ఖాన్, నెహ్రా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ధోనీ 12 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 5, పీటర్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. మోర్కల్, ప్లెసిస్, కల్లిస్ తలో వికెట్ తీశారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ ల నష్టం తో లక్ష్యాన్ని చేధించింది. ఈ ప్రపంచకప్లో ఇది భారత్ కు తొలి వోటమి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment