Wednesday, March 16, 2011

2జీ స్పెక్ట్రమ్ కేసు: మాజీ మంత్రి రాజా స్నేహితుని ఆత్మహత్య

న్యూఢిల్లీ,మార్చి 16: : 2జీ స్పెక్ట్రమ్ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఎ..రాజా స్నేహితుడు, గ్రీన్ హౌస్ ప్రాపర్టీ ఎం.డి. సాధిక్ భాషా ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నయ్‌లోని తన నివాసంలోనే ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సాధిక్ భాషా నివాసంలో సీబీఐ పలుమార్లు సోదాలు నిర్వహించింది. దీంతో మనస్తాపానికి గురైన సాధిక్ భాషా ఈ చర్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఈయన డీబీ రియాలిటీ సంస్థ ఎండీ సాధిక్ బాల్వాకు పరోపకారం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కోణంలోనే సీబీఐ ఆయన నివాసంపై పలుమార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.ఇదిలావుండగా, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్మును డీబీ రియాలిటీకి మళ్లించి అక్కడ నుంచి డీఎంకే అధికార పార్టీ కలైంజ్ఞర్ టీవీకి అందజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్పెక్ట్రమ్ సొమ్ముతోనే కలైంజ్ఞర్ టీవీని నెలకొల్పినట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఛానల్‌కు కరుణానిధి కుమార్తె, రాజ్యసభ్యురాలు కనిమొళి, కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాల్‌ భాగస్వాములుగా ఉన్నారు.  వీరిని కూడా  సీబీఐ ఇటీవల దర్యాప్తు జరిపింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...