Thursday, March 31, 2011

121 కోట్లకు చేరిన భారత జనాభా

న్యూఢిల్లీ,మార్చి 31 : 2011 జనాభా లెక్కల వివరాలను కేంద్ర0 గురువారం ఇక్కడ అధికారికంగా విడుదల చేసింది.  తాజా గణాంకాల ప్రకారం  భారత జనాభా 121 కోట్లుకు చేరింది. గత పదేళ్లలో దేశ జనాభా 18 కోట్లుకు పెరిగింది. పురుషులు 62 కోట్లు, మహిళలు 58కోట్లు వున్నారు.  పురుషులు 17 శాతం, స్ర్తీలు 18 శాతం పెరిగారు. 2001 తర్వాత మళ్లీ పదేళ్లకు ఈ ఏడాది పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను సేకరించిఇంది. కాగా అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా, నాగాలాండ్‌లో జనాభా శాతం తగ్గింది.  కాగా, ఆంధ్రప్రదేశ్ జనాభా (8,46,65,533) 8 కోట్ల 46 లక్షలకు చేరుకుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...