Monday, February 21, 2011

పలు జిల్లాల్లో భారీ వర్షం:పంటలకు నష్టం

హైదరాబాద్,ఫిబ్రవరి 21:  రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం కురిసిన వర్షాలు జనజీవితాన్ని అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, పంటనష్టం తట్టుకోలేక ఓ రైతు గుండె పోటుతో మృతి చెందాడు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలి పోగా, పొగాకు జిగురు కారిపోయాయి. కళ్లాల్లో ఉన్న మిర్చి తడిసిపోయింది. వందలాది ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండలో వడగండ్ల వర్షం కురిసింది. బలమైన గాలుల వల్ల లు  పొలాల్లో ఉంచిన వేరుశనగ కుప్పలు కొట్టుకుపోయాయి. నల్గొండ జిల్లాలో కొన్నిచోట్ల  కురిసిన భారీ వర్షాల వల్ల  వరి, మిర్చి, బత్తాయి పంటలకు నష్టం వాటిల్లింది.  కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 40,679 ఎకరాల్లో పం టలు దెబ్బతింది.  చిత్తూరు జిల్లా చంద్రగిరిలో గాలి, వాన బీభత్సం సృష్టించింది. తిరుమలలో  కుండపోత వర్షం కురిసింది.ప్రకాశం జిల్లాలో మిర్చి, పొద్దుతిరుగుడు, ముదురు పొగాకు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.  మచిలీపట్నంలో బస్‌స్టాండు జలమయమైంది. విజయవాడలో ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు మండలాల్లో పొలాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది.కాగా,  ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు, కోస్తాంధ్రమీదుగా భూ ఉపరితల ద్రోణి ఆవరించి న కారణంగా రానున్న 24 గంటల్లో కో   స్తాలో కొన్నిచోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం  తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...