కెనడాను సునాయాసంగా ఓడించిన లంక



హంబన్‌టోటా,ఫిబ్రవరి 20: ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 210 పరుగుల ఆధిక్యంతో కెనడాపై ఘనవిజయం సాధించింది. భారత్, లంక, పాకిస్తాన్ సంతతి ఆటగాళ్లతో కూడిన  కెనడా జట్టుపై శ్రీలంక ఆట మొదటి నుంచి చివరిదాకా ఆధిపత్యాన్ని కనబర్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 332 పరుగులు సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్  మహేల జయవర్ధనే (81 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100) సెంచరీ చేయగా... కెప్టెన్ కుమార సంగక్కర (87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 92) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.   అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా బ్యాటింగ్ వైఫల్యంతో 36.5 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, తిసారా పెరీరా మూడేసి వికెట్లు తీసుకున్నారు. సెంచరీ వీరుడు జయవర్ధనేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. 


Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు