Thursday, February 17, 2011

దేవాస్‌ తో ఒప్పందం రద్దు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17: పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన వాణిజ్య విభాగం ఆంట్రిక్స్కు, ప్రైవేటు సంస్థ దేవాస్ మల్టీమీడియాకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. ఈ ఒప్పందం దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా లేదని వెల్లడించింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారల పై కేంద్ర కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ నిర్ణయం తీసుకుంది. ఇస్రోకు చెందిన జీశాట్-6, జీశాట్-6ఏలలో 90 శాతం ట్రాన్స్పాన్డర్లను వినియోగించుకునేందుకు ఆంట్రిక్స్, దేవాస్ కంపెనీల మధ్య ఒప్పందం కుదరడం తెలిసిందే. 2005 జనవరిలో జరిగిన ఒప్పందం ప్రకారం దేవాస్ సంస్థకు సుమారు రూ. 1,350 కోట్లకే (30 కోట్ల డాలర్లు) రెండు ఉపగ్రహాలకు చెందిన ట్రాన్స్పాండర్లను 12 ఏళ్లపాటు లీజుకిచ్చారు.  దేవాస్‌ తో ఒప్పందం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 2 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడటంతో కలకలం రేగింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...