"బుడుగు వెంకటరమణ" ఇకలేరు

చెన్నై,ఫిబ్రవరి 23: ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. బాపు దర్శకతంలో పలు చిత్రాలకు ఆయన సంభాషణలు వ్రాశారు. రక్తసంబంధం చిత్రం ద్వారా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ‘సాక్షి’ సినిమాతో వెంకటరమణ నిర్మాతగా మారారు. దర్శకుడు బాపు కు అత్యంత   సన్నిహితుడైన ముళ్ళపూడి హాస్య  రచన 'బుడుగు' ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ రచన ద్వారా ఆయన "బుడుగు వెంకటరమణ"గాప్రసిద్ధి చెందారు. కోతి కొమ్మచ్చి పేరుతో ఆత్మకథను రాశారు.బాపు-రమణ కాంబినేషన్ లో తాజాగా ' శ్రి రామరాజ్యం ' చిత్రం పూర్తి కావస్తోంది.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు