Monday, February 21, 2011

కొనసాగుతున్న సహాయనిరాకరణ : ట్రెజరీ కార్యాలయాల్లో స్తంభించిన లావాదేవీలు

హైదరాబాద్,ఫిబ్రవరి 21:    తెలంగాణ జిల్లాల్లో సహాయనిరాకరణ కొనసాగుతోంది.సహాయ నిరాకరణలో భాగంగా తెలంగాణ ఉద్యోగులు సోమవారం రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డెరైక్టరేట్‌లో ప్రధాన సర్వర్‌ను డౌన్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. బ్యాక్ అప్ సర్వీస్ లేకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలకు ఆస్కారం లేకుండాపోయింది. అసలే అత్యవసరాలకు మినహా మిగతా బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రధాన సర్వర్‌ను డౌన్ చేయడంతో జీతాలు, పెన్షన్లు, గ్రాట్యుటీ తదితర అన్ని రకాల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చెందిన బిల్లులను తీసుకోవడానికి ఆంక్షలు లేవని, సర్వర్ డౌన్ కావడంతో ఇప్పుడు ఆ బిల్లులు కూడా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ట్రెజరీ కార్యకలాపాలను, చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారా కాకుండా సిబ్బందితో చేయిస్తామని, కానీ తెలంగాణలో సహాయ నిరాకరణ వల్ల ఆవిధంగా చేయించడం సాధ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ కారణంగా తెలంగాణ జిల్లాల్లో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను తీసుకోవడానికి వీలుండదని తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...