Saturday, February 19, 2011

సహాయనిరాకరణతో స్తంభించిన తెలంగాణ

హైదరాబాద్,ఫిబ్రవరి 19: తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణతో తెలంగాణలోని పది జిల్లాల్లో 3 రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించాయి. అన్ని కార్యాలయాల్లో ఎక్కడి ఫైళ్లక్కడే ఆగిపోయాయి. భూములు, భవనాల వంటి స్థిరాస్తి క్రయ విక్రయాలు ఆగిపోవడంతో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన రైతులు, ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రబీ పంట రుణాలకు సాగు సర్టిఫికెట్లు కోసం ఎమ్మార్వో కార్యాలయాలకు వచ్చిన రైతులు ఒట్టి చేతులతో వెళ్లాల్సి వచ్చింది. వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం తెలంగాణ నుంచే సమకూరుతోంది. సహాయ నిరాకరణ వల్ల ఆ మేరకు రాబడి నిలిచిపోయింది. రాష్టవ్య్రాప్తంగా రోజుకు సగటున సుమారు 6,000 భవనాలు, స్థలాల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటిలో తెలంగాణ వాటా దాదాపు సగం. ఆ లెక్కన మూడు రోజుల్లో 9,000 పై చిలుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ’ 11 కోట్ల రోజువారీ ఆదాయంలో సగం తెలంగాణ నుంచి వస్తుంది.  వాహనాల రిజిస్ట్రేషన్లదీ అదే పరిస్థితి. రాష్ట్రంలో నెలకు సగటున 80 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాటిలో 60 శాతం దాకా తెలంగాణలోనే ఉంటాయి. ఆ లెక్కన తెలంగాణలో రోజుకు సగటున 1,400 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వాణిజ్య పన్నుల రిటర్నుల స్వీకరణ నిలిచిపోయింది.

22 నుంచి 48 గంటలపాటు తెలంగాణ బంద్

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన సహాయ నిరాకరణలో భాగంగా ఈ నెల 22 నుంచి 48 గంటలపాటు తెలంగాణ బంద్ పాటించాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.  అత్యవసర సర్వీసులు మినహా రవాణా, పరిపాలనను పూర్తిగా స్తంభింపజేయాలని ప్రజలను కోరారు. ఈజిప్టు తరహాలో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపైకి రావాలన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...