Tuesday, February 22, 2011

ఇంగ్లాండ్ ను అల్లాడించి ఓడిన నెదర్లాండ్స్

నాగ్‌పూర్  , ఫిబ్రవరి 22:   వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ నెదర్లాండ్స్ తో  జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అతికష్టం మీద గెలిచిఇంది.  293 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ స్ట్రాస్ (88), పీటర్‌సన్‌లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. పీటనర్‌సన్ (39) నిషమ్రించిన అనంతరం.. క్రీజ్‌లోకి వచ్చిన ట్రాట్ (62 )పరుగులతో జట్టు ఇన్నింగ్స్‌కు చక్కటి పునాది వేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ (33), కాలింగ్‌వుడ్(30), రవి బోపారా (30)లు ఆచితూచి ఆడి ఇంగాడ్‌ను గెలుపు బాట పట్టించారు. డచ్ బౌలలర్లలో డస్కెచీ రెండు వికెట్లు తీయగా, బుకారీ, సీలార్‌లు తలో వికెట్టు సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ అంచనాలు మించి ఆడింది. ఇంగ్లీష్ బౌలింగ్‌ను సమర్ధంగా ఎదుర్కొని 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచారు.డస్కెటీ 110 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 119 పరుగులు చేసి నెదర్లాండ్స్ భారీ స్కోరుకు దోహదపడ్డాడు.చివర్లో కూపర్ (47),బోరెన్ (35), గ్రూత్ (28) పరుగులు చేయడంతో నెదర్లాండ్స్ మంచి స్కోరు చేసి0ది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...