Wednesday, February 16, 2011

ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలపై ఫలించని చర్చలు

హైదరాబాద్ ,ఫిబ్రవరి 16: ఫీజు రీఎంబర్స్ మెంట్  బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలతో మంత్రి మండలి ఉప సంఘం బ్య్ధవారం రెండవసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఫీజులు, ఉపకారవేతనాల కింద వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. దశలవారీగా అక్టోబర్ వరకు 25 శాతం చొప్పున బకాయిలు చెల్లిస్తామని తెలిపింది. అందుకు యాజమాన్యాలు అంగీకరించలేదు. ఈనెల 20వ తేదీలోపు 50 శాతం, 28లోపు మొత్తం బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. లేకుంటే ఈ నెల 24 నుంచి కాలేజీలను మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి.
18 నుంచి ఏడు రోజుల పాటు నిరాహారదీక్ష జగన్
కాగా, ఫీజు రీయింబర్స్'మెంటు కోసం హైదరాబాద్'లో ఈ నెల   చేయనున్నట్లు  మాజీ ఎం.పి. వైఎస్ జగన్మోహన రెడ్డి  ప్రకటించారు. ఫీజు రీయింబర్స్'మెంటుపై సుప్రీం కోర్టు మొట్టికాయవేసినా సిగ్గులేదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...