Friday, February 25, 2011

చికాగో సిటీ కౌన్సిల్‌కు ఎన్నారై ఎన్నిక

చికాగో, ఫిబ్రవరి 25:  ఉత్తర చికాగోలోని 47వ వార్డుకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతి యువకుడు అమేయ పవార్ విజయ దుందుభి మోగించాడు. .. ఈ వార్డుకి 30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ వేత్తను ఖంగుతినిపించి  తొలిసారి చికాగో సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులకు జన్మించిన పవార్ పట్టభద్రుడై అతిమామూలుగా వార్డు ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే  ఓటర్లు 50 శాతం ఓట్లతో పట్టంకట్టారు. ఈ విజయం అపురూపమైనదని, అందరితో కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పవార్ చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...