ముంబై,,ఫిబ్రవరి 21:ముంబై దాడుల నరహంతకుడు, కరడుగట్టిన పాక్ ఉగ్రవాది కసబ్కు కింది కోర్టు విధించిన మరణశిక్షను బాంబే హైకోర్టు ఖరారు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరిగిన ఈ అత్యంత అరుదైన, అసాధారణ మృత్యుకాండ దోషికి మరణదండనే సరైందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇద్దరు భారతీయులు ఫాహిమ్ అన్సారీ, షాబుద్దీన్ అహ్మద్లను కింది కోర్టు నిర్దోషులుగా తేల్చడాన్ని హైకోర్టు సమర్థించింది. వీరి నిర్దోషిత్వాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర సర్కారు దాఖలు చేసిన అప్పీలును బలమైన సాక్ష్యాలు లేనందున కొట్టేసింది. ప్రత్యేక విచారణ కోర్టు తనకు గత ఏడాది మేలో విధించిన మరణశిక్షపై కసబ్ చేసుకున్న అప్పీలును జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ ఆర్వీ మోరేల హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారించి తీర్పు చెప్పింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న క సబ్ విచారణకు వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యాడు. క్రిమినల్ కుట్ర, దేశంపై యుద్ధం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఆయుధాలు, పాస్పోర్టు, తది తర చట్టాల కింద కసబ్కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment