హైదరాబాద్,ఫిబ్రవరి 15: వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పై అయన బాబాయి, రాష్ట్ర మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. మంగళవారం ఆయన మావయ్య వివేకాతో కలిసి ఢిల్లీ వెళ్లారు. జగన్ పై పోటీ చేసే అవకాశాన్ని తనకే ఇవ్వాలని ఆయన సోనియా గాంధీని అభ్యర్థించేందుకు వెళ్లారు. తాను కూడా వైఎస్సార్ కుటుంబానికి చెందిన వ్యక్తినే కనుక తనకు ఆ అవకాశాన్ని ఇవ్వాలని నర్రెడ్డి కోరుతున్నారు. జగన్తో కుటుంబంపరమైన ఇబ్బందులు ఏమీ లేవనీ, కేవలం రాజకీయ వైరం మాత్రమే ఉన్నదన్నారు. జగన్పై పోటీ చేసేందుకు వీలుగా అధిష్టానం తనకు అవకాశం ఇస్తే జగన్ను చిత్తుగా ఓడిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే తాను నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు జగన్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో నర్రెడ్డి కూడా కడప పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. ఇక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విజయమ్మను జగన్ దించే అవకాశాలు ఉన్నాయి. ఆమెపై వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment