పోలీసులలో టెన్షన్ టెన్షన్

 ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు--  మరోవైపు తెలంగాణ ఆందోళనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఆందోళనలు, మరోవైపు  అసెంబ్లీ సమావేశాల్నేపథ్యంలో పోలీసు యంత్రాంగం  టెన్షన్ టెన్షన్ గా ఉంది  అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతుండగా టిఆర్‌ఎస్ ఈ నెల 19న జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఇటు చూస్తే సహాయనిరాకణకు తెలంగాణ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌కు వచ్చే అన్ని జాతీయ రహదారులను దిగ్బంధనం చేసేందుకు టిఆర్‌ఎస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ రోజు హైవేలపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతుంది. తెలంగాణ సరిహద్దుల్లో రహదారులపై వాహనాలను నిలిపి వేసి రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తే ప్రయాణీకులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో ఉన్న పారా మిలటరీ బలగాలను శాంతిభద్రతల పరిస్థితి తలెత్తితే అదుపు చేసేందుకు మోహరిస్తున్నారు. హైవేలపై పోలీసు పెట్రోలింగ్ కూడా విస్తృతం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున అక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను నగర పోలీసులు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ నుంచి సచివాలయం, అసెంబ్లీ వరకు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. నగరంలో అదనపు పారామిలటరీ బలగాలను సచివాలయం ముందు ఇప్పటికే మోహరించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు