Thursday, February 17, 2011

క్రికెట్ పండగ షురూ...

శనివారం తొలి మ్యాచ్ లో భారత్-బంగ్లా ఢీ ..

ఢాకా,ఫిబ్రవరి 17: రాక్‌స్టార్ బ్రయన్ ఆడమ్స్ మెరుపులు, ఉపఖండ సాంప్రదాయల మధ్య 43 రోజులపాటు క్రికెట్ అభిమానులకు పండగ సంబరాన్ని నింపే 10వ క్రికెట్ వరల్డ్ కప్‌ టోర్నమెంట్ ను  బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బంగబంధు స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల కేరింతల మధ్య క్రికెట్ పండగ మొదలైంది. వివిధ దేశాలకు చెందిన కెప్టెన్లను బంగ్లాలోని సంప్రదాయ రిక్షాలో కూర్చో బెట్టి స్టేడియంలోకి తీసుకువచ్చారు. ఈ టోర్నిలో 14 దేశాలు, 210 మంది క్రీడాకారులు పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్, ఎహసాన్, లాయ్‌లు, బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్, బంగ్లాదేశ్ కళాకారులు రునా, సబీనా యాస్మిన్, ముంతాజ్‌లు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించారు. శనివారం జరిగే ప్రపంచకప్ క్రికెట్ ఆరంభ మ్యాచ్‌లో  బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.  ప్రపంచకప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ కప్ టోర్నిలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సేన విజయం సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈసారి ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంటుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...