పార్లమెంట్ ప్రసంగంలో రాష్ట్రపతి హామీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 21: ప్రజాజీవితంలో అవినీతికి తావులేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్టప్రతి ప్రసంగించారు.ప్రజాజీవితంలో ఉన్నత విలువలను, సమగ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తుందని, వస్తామని, పాలనలో పారదర్శకతను పెంపొందిస్తుందని హామీ ఇచ్చారు.సుమారు 50 నిమిషాలపాటు ప్రసంగించిన రాష్టప్రతి.. యూపీఏ-2 ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. అవినీతిని అరికట్టే చర్యలలో భాగంగా శాసన, పాలనాపరమైన చర్యలన్నింటిని మంత్రుల బృందం పరిశీలిస్తోందని, సహజ వనరుల వెలికితీతకు బహిరంగ, పోటీ వ్యవస్థను ప్రవేశపెట్టడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగుల కేసులను సత్వరం విచారించి చర్యలు తీసుకోవడానికి చట్టాల్లో సవరణలు చేయడం వంటివి ఈ బృందం పరిశీలనలో ఉన్నాయని రాష్ట్రపతి చెప్పారు. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి, రైతులు పండించిన పంటలకు తగిన ప్రతిఫలం అందించడానికి కృషి జరుగుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలోనే లోక్సభ ముందుకు వస్తుందని తాను ఆశిస్తున్నట్టు ప్రతిభా పాటిల్ తమప్రసంగంలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 21: ప్రజాజీవితంలో అవినీతికి తావులేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్టప్రతి ప్రసంగించారు.ప్రజాజీవితంలో ఉన్నత విలువలను, సమగ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తుందని, వస్తామని, పాలనలో పారదర్శకతను పెంపొందిస్తుందని హామీ ఇచ్చారు.సుమారు 50 నిమిషాలపాటు ప్రసంగించిన రాష్టప్రతి.. యూపీఏ-2 ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. అవినీతిని అరికట్టే చర్యలలో భాగంగా శాసన, పాలనాపరమైన చర్యలన్నింటిని మంత్రుల బృందం పరిశీలిస్తోందని, సహజ వనరుల వెలికితీతకు బహిరంగ, పోటీ వ్యవస్థను ప్రవేశపెట్టడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగుల కేసులను సత్వరం విచారించి చర్యలు తీసుకోవడానికి చట్టాల్లో సవరణలు చేయడం వంటివి ఈ బృందం పరిశీలనలో ఉన్నాయని రాష్ట్రపతి చెప్పారు. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడానికి, రైతులు పండించిన పంటలకు తగిన ప్రతిఫలం అందించడానికి కృషి జరుగుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలోనే లోక్సభ ముందుకు వస్తుందని తాను ఆశిస్తున్నట్టు ప్రతిభా పాటిల్ తమప్రసంగంలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment