న్యూజిలాండ్పై భారత్ విజయం
చెన్నై ,ఫిబ్రవరి 16: ప్రపంచకప్ క్రికెట్ సన్నాహక పోటీల్లో భాగంగా బుధవారమిక్కడ జరిగిన వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 361 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 43.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయింది. భారత బౌలర్లలో హర్భజన్, యువరాజ్, పీయూష్ చావ్లా, నెహ్రా రెండేసి వికెట్లు తీశారు. ఆశ్విన్కు ఒక వికెట్ దక్కింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది.
Comments