ముంబై,ఫిబ్రవరి 24: ‘అంకుల్ పాయ్ ' గా దేశంలోని హస్యప్రియుల్ని ఆలరించిన అనంత్ వి పాయ్ ముంబైలో కన్నుమూశారు. అమర్ చిత్ర కథ కామిక్స్ ద్వారా భారతీయ సంస్కృతి, ఆచారాలను పాఠకులకు ‘అంకుల్ పాయ్’ అందించారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కనారా జిల్లాలోని కర్కాలలో అనంత పాయ్ జన్మించారు. ముంబై యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్లో చేరి ఇంద్రజాల్ కామిక్స్ ద్వారా ఫాంథామ్, మంద్రకే ది మెజీషియన్ శీర్షికల ద్వారా చిన్నారులను ఆకట్టుకున్నారు. ఒక సమయంలో దూరదర్శన్లో ప్రసారమైన క్విజ్ పోటీలో రామాయణంలో రాముడి తల్లి ఎవరూ అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానమివ్వకపోవడంతో మనస్థాపం చెంది కామిక్స్ ద్వారా భారతీయ పురాణాలను, సంస్కృతిని అందించాలని నిశ్చయించుకున్నారు. ఆతర్వాత అమర్ చిత్ర కథను ప్రారంభించి ఎడిటర్, గ్రాఫిక్ మాస్టర్, రచయిత, పబ్లిషర్, చరిత్రకారుడిగా పలు బాధ్యతల్ని నిర్వహించారు. అమర్ చిత్ర కథ 20 భాషల్లోకి అనువదించబడినది. పెద్దల్ని సైతం ఆలరించిన ట్వింకిల్ కూడా అంకుల్ పాయ్ సృష్టించిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment