Friday, February 25, 2011

‘జన్మభూమి గౌరవ్’ పేరుతో నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్ళు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25: రైల్వే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు  మమతా బెనర్జీ రైల్వే  బడ్జెట్‌లో  నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రకటించారు. ప్రత్యేకంగా  ‘జన్మభూమి గౌరవ్’ పేరుతో దేశంలోని చారిత్రక, విద్యా ప్రాంతాలను అనుసంధానిస్తూ  ఈ నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెడతారు. .1. హౌరా-బోల్పూర్-రాజ్‌గిర్(నలంద)-పాటలీపుత్ర(పాట్నా)- వారణాసి(సార్నాథ్)-గయ-హౌరా 2. బెంగళూరు-మైసూరు-హసన్ (స్పేస్ ఫెసిలిటీ, బెలూర్, హలేబిద్, శ్రావాణ్‌బెంగొలా)-హూబ్లీ-గడగ్(హంపి)-బిజాపూర్ (గోలె గుంబాజ్)-బెంగళూరు 3. చెన్నై-పుదుచ్చేరి-తిరుచిరాపల్లి-మదురై-కన్యాకుమారి- తిరువనంతపురం-ఎర్నాకుళం-చెన్నై   4. ముంబై-  అహ్మదాబాద్-(లోథల్)-భావ్‌నగర్(పాలిటానా)-అలాంగ్)-గిర్-డయూ (సోమనాథ్-వెరావల్)-(జునాగఢ్)-రాజ్‌కోట్-ముంబై మార్గాలలో ఈ రైళ్ళు ప్రయాణిస్తాయి.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...