Friday, February 18, 2011

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు లేదన్న కేంద్రం

సోనియాను కలవకుండానే  తిరిగి హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 18:  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టడంలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ స్పష్టంచేశారు. మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో 31 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. వీటిలో తెలంగాణ బిల్లు లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ తాజా పరిస్థితులను వివరించి, రాష్ట్ర ఏర్పాటును కోరేందుకు వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి పయనమైంది. సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న 20 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీల బృందం తొలిరోజు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ను, తరువాత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీలను కలిసి తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని వివరించింది. చివరగా శుక్రవారం హోంమంత్రి చిదంబరాన్ని కలిశారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే పరిస్థితులను వివరించారు. ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీ అధినేత సోనియగాంధీ అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పయనమయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...