హైదరాబాద్,ఫిబ్రవరి 18: ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ ఎం.పి. వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద దీక్షను చేపట్టారు. ఈ దీక్ష 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది. కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ , ఆమె భర్త, కాంగ్రెసు ఎమ్మెల్సీ కొండా మురళి కూడా దీక్షకు హాజరయ్యారు. వైయస్ జగన్ దీక్షకు వచ్చినవారిలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. మిగతా 15 మంది కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శానససభ్యులు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి దీక్షకు హాజరయ్యారు. తెలుగుదేశం శానససభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగి రెడ్డి వైయస్ జగన్ దీక్షకు వచ్చారు. దీక్షకు హాజరైన కాంగ్రెసు శాసనసభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, బాబూరావు, రాజా అశోక్ బాబు, రవి, గుర్నాథ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, జయసుధ, ఆదినారాయణ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment