రాష్ట్రానికి ఈ ఖర్మ కాంగ్రెస్ స్వయంకృతమే

 కాంగ్రెస్ హైకమాండ్‌ పై  సీనియర్ నేత దివాకరరెడ్డి ధ్వజం 

హైదరాబాద్,ఫిబ్రవరి 26: కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏమాత్రం బుద్ధిలేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.దివాకర్ రెడ్డి సంచలన  వ్యాఖ్యలు చేశారు. అధిష్టానంలో పెద్దలమని చెప్పుకునే వారు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. వారు తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్ర రావణకాష్టాన్ని తలపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక చర్చావేదికలో పాల్గొన్న జేసీ.. కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన వల్లే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆయన ఎవరిని అడిగి ఆ ప్రకటన చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదన్నారు. అధిష్టానం తీసుకునే మతిలేని నిర్ణయాలు, బుద్ధిలేని చర్యల వల్ల పరిస్థితి ఈ విధంగా దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఈ ఖర్మ కాంగ్రెస్ స్వయంకృతమేనన్నారు. తెరాస చీఫ్ కేసీఆర్ కూడా ఒక రాజకీయ నేతగా కాకుండా ఉద్యమ నేతగానే ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఆయన చేస్తున్న హెచ్చరికల వల్ల హైదరాబాద్‌లో నివశించే 80 శాతం సీమాంధ్రులు భయంతో జీవనం సాగిస్తున్నారన్నారు. అంతేకాకుండా, తెలంగాణలో ఏ చిన్న ఉద్యమం జరిగినా సీమాంధ్రుల ఆస్తులే ధ్వంసమవుతున్నాయని జేపీ గుర్తు చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు