Thursday, February 24, 2011

సినీ...బాతాఖానీ... !

ఆడపిల్ల తల్లి: చందమామ సినిమాలో సెకండ్ హీరోయిన్  సింధూ మీనన్  ఓ ఆడపిల్లకు తల్లి అయింది.  యుకె కి చెందిన వ్యాపార వేత్త   ప్రభుని ఆమె గత ఏడాది   సింధూ మీనన్ మొదట శ్రీహరి చిత్రం భధ్రాచలం చిత్రం లో చేసింది. ఆ తర్వాత శివాజీ సరసన 'శ్రీరామ చంద్రులు' చిత్రంలో కనిపించింది. అలా అప్పుడప్పుడూ అవకాశాలు వచ్చిన ఆమె తన సొంత భాష మళయాళంలోనూ బిజీ కాలేకపోయింది. కెరీర్ చివరి దశలో ఆమె తమిళంలో చేసిన ఈరమ్ చిత్రం మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్నడంలో చేసిన హూలియా అనే చిత్రంలోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆమె చివరగా తెలుగులో చేసిన సుభధ్ర చిత్రం ఇంకా విడుదల కావల్సి వుంది.

ఏదీ 'దూకుడు '!: మహేష్ నటిస్తున్న' దూకుడు' చిత్రం ఈ వేసవికి విడుదల కావాల్సి వుంది. కానీ సినీ పరిశ్రమ సమ్మెతో ఇంకా దూకుడు వర్క్ చాలా పెండింగ్ లో వుందిట. ఎంత త్వరగా షూటింగ్ పూర్తి చేసినా ఈ సమ్మర్ కి చిత్రాన్ని విడుదల చేయలేమని దర్శకుడు శ్రీను వైట్ల చేతులెత్తేసాడు. ఈ చిత్రం పూర్తయితే కానీ మహేష్ మరో చిత్రం ప్రారంభం కాదు. సో, ఖలేజా ప్లాప్ తో కళ్ళు తెరుచుకుని  ఇక ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు విడుదలయ్యేటట్లు చూసుకుంటానంటూ ఇచ్చిన  మాట ను మహేష్ దక్కించుకునేటట్టు కనిపించడం లేదు.

 "నెపోలియన్"గా సునీల్!:  'మర్యాదరామన్న సునీల్ త్వరలో "నెపోలియన్" అవతారం ఎత్తనున్నాడు.  రాజమౌళి కో డైరక్టర్ కోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి రెండవ వారంలో ప్రారంభంకానుంది. ఈ చిత్రం కామెడీగా కాకుండా రెగ్యులర్ యాక్షన్ చిత్రం తరహాలో సాగనుందని సమాచారం.సునీల్ సరసన దీక్షాసేధ్ నటిస్తుంది. ఈ చిత్రానికి మొదట 'శివం' అనే టైటిల్ పెట్టాలనుకున్నారుట కాని కథకు నెపోలియన్ టైటిల్  యాప్ట్ గా ఉంటుందని ఆ పేరునే  ఫిక్స్ చేశారుట.


మోహన్ బాబా-మజాకా!: చిరంజీవి, మోహన్ బాబు.  మథ్య  పచ్చగడ్డి వేస్తే  ఇంకా భగ్గుమంటూనే ఉందనిపిస్తోంది. .  చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు‌లో కలిపేసిన సందర్భంలో  మోహన్ బాబు తన సన్నిహితుడి ఇంట్లో ఫంక్షన్‌‌లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.చిరంజీవి సినిమా వాళ్శ పరువు తీశాడని,  ఎవరితో యుద్దం చేస్తానని చెప్పాడో వారికే జై కొట్టాడని,  ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్శలా వ్యూహాలు లేకుండా వ్యవహరించి సినిమా వాళ్శు రాజకీయాలకు పనికి రారని అనిపించేలా చేశాడని మోహన్ బాబు మండిపడినట్టు సమాచారం.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...