Friday, February 25, 2011

మమతా ఎక్స్ ప్రెస్ ఫర్ బెంగాల్... !

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25 : 2011-12 సంవత్సరానికి   రూ.1,06,239 కోట్లతో రైల్వే  బడ్జెట్‌ను రైల్వే మంత్రి మమతా బెనర్జీ పార్లమెంట్ కు సమర్పించారు. రైల్వే వార్షిక ప్రణాళికను   రూ.57,630 కోట్లుగాను, మార్కెట్ రుణాలను రూ.2,059 కోట్లుగాను  ప్రతిపాదించారు. మమతా బెనర్జీ ఈసారి కూడా రైల్వే బడ్జెట్‌లో పశ్చిమబెంగాల్‌కు వరాల జల్లు కురిపించారు. రైల్వే ఆధారిత పరిశ్రమలతో పాటు, కొత్తరైళ్లను బెంగాల్‌కు తరలించి ఆమె తన సొంతరాష్ట్రానికి పెద్దపీట వేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ రైల్వే బడ్జెట్‌లో కేరళకు కొంత ప్రాధాన్యత కల్పించారు.
 రైల్వే  బడ్జెట్‌ ప్రధానాంశాలు
పేదలకు రూ. 25తో 100 కి.మీల ప్రయాణం- ఇంఫాల్‌కు రైల్వే పరిధి విస్తరణ- ఈ సంవత్సరాంతానికి దేశంలోని అన్ని రైల్వే గేట్ల వద్ద కాపలాదారుల ఏర్పాటు- ఆలిండియా సెక్యూరిటీ హెల్ప్ లైన్ ఏర్పాటు- నాగపూర్, చండీఘర్, సికింద్రాబాద్ స్టేషన్ల ఆధునికీకరణ- రూ.5,406 కోట్లతో డబ్లింగ్ పనులు- దూరప్రాంత ప్రయాణికులకు మల్టీపర్పస్ స్మార్ట్ కార్డులు- ఆంధ్రప్రదేశ్‌లో 1300 మోగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్- కొత్తగా సూపర్ ఏసీ క్లాస్ ప్రయాణం- ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో 85 కొత్త ప్రతిపాదనలు- ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా రూ. 10వేల కోట్లు సేకరణ- రిజర్వేషన్ బుకింగ్ ఛార్జీలు 50 శాతం తగ్గింపు- ఏటా 700 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం- ఉద్యోగులకు 10వేల ఇళ్ల నిర్మాణం- ప్రమాదాల నివారణకు యాంటీ-కొలిజన్ పరికరాలు-16వేలమంది మాజీ సైనిక ఉద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు- పదవీ విరమణ చేసిన కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు ఉపాధి- 1700 ఎకరాల భూమికి 700 కోట్లు చెల్లింపు- ప్రధానమంత్రి రైల్ వికాస్ యోజన ప్రారంభం- బలహీన వర్గాల రైల్వే ఉద్యోగుల పిల్లలకు నెలకు రూ. 1200 స్కాలర్ షిప్-ఖాళీగా ఉన్న లక్షా 75వేల ఉద్యోగాల భర్తీ- ఏసీ బుకింగ్ ఛార్జీలు 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గింపు- కొత్త్తగా 3 శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు- కేంద్ర హోంశాఖ సాయంతో అయిదు పాలిటెక్నిక్ కళాశాలలు -ప్రమాదాలు జరగని రాష్ట్రానికి రెండు ప్రత్యేక రైళ్లు- పురుషుల సీనియర్ సిటిజన్ వయో పరిమితి 62కి కుదింపు- మహిళల సీనియర్ సిటిజన్ వయో పరిమితి 58కి తగ్గింపు-సికింద్రాబాద్‌కు 83 సబర్బన్ సర్వీసులు.
రైల్వే  బడ్జెట్‌ లో ఆంధ్ర...
విశాఖ- సికింద్రాబాద్ మధ్య కొత్తగా దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అలాగే తిరుపతి-గుంతకల్ మధ్య కొత్తగా ప్యాసింజర్, సికింద్రాబాద్-పుణె మధ్య శతాబ్ధి , హైదరాబాద్-దర్భంగ్ మధ్య  ఎక్స్ ప్రెస్ లతో పాటు  కాచిగూడ-మిర్యాలగూడ మధ్య కొత్త ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్ మధ్య ఇంటర్‌సిటీ, హౌరా-విశాఖ మధ్య  ఎక్స్ ప్రెస్, ఫలక్‌నూమా-మేడ్చల్ మధ్య కొత్త ప్యాసింజర్, తిరుపతి-అమరావతి మధ్య కొత్త  ఎక్స్ ప్రెస్, హైదరాబాద్- ఫలక్‌నూమా-లింగంపల్లి మధ్య కొత్త సర్వీసులు ప్రకటించారు. . కొత్తగా కరీంనగర్-హసన్‌పర్తి, భద్రాచలం-విశాఖ రైలు  మార్గాలను  కూడా ప్రతిపాదించారు. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని చేపడతామని రైల్వే మంత్రి  తెలిపారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...