Wednesday, February 23, 2011

లిబియాలో కనిపిస్తే కాల్చివేత

ట్రిపోలీ,ఫిబ్రవరి 23: లిబియాలో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆదేశంలో కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాల్ని జారీచేసింది. లిబియాకు విమానసర్వీసులు రద్దయ్యాయి. లిబియాలో వున్న భారతీయుల్ని తరలించేందుకు విమానాలు, నౌకలు ట్రిపోలీ చేరుకున్నాయి. 41 ఏళ్ల గఢాఫీ పాలనకు  చరమగీతం పాడాలని ఆందోళనకారులు చేపట్టిన  ఉద్యమానికి మద్దతుగా ఇంటీరియర్ మంత్రి అబ్దుల్ ఫతా యూనిస్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకు అందోళనల్లో 300 మంది పౌరులు మరణించినట్టు సమాచారం. భారతీయుల్ని సులభంగా తరలించేందుకు నౌకలు ఈజిప్టుకు చేరుకున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమారావు తెలిపారు. లిబియాలోని భారతీయులకు రాయబారి అందుబాటులో వున్నారని, క్లియరెన్స్ లభించగానే భారతీయుల తరలింపు చర్యలు చేపడుతామని అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...