Monday, February 21, 2011

ఎమ్యెల్సీ ఎన్నికల నోటీఫికేషన్ జారీ

హైదరాబాద్,ఫిబ్రవరి 21: శాసన సభ్యుల కోటాలో 10 ఎమ్యెల్సీ స్థానాల ఎన్నికలకోసం ఎన్నికల సంఘం నోటీఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 28వ తేది నుంచి నామినేషన్లను  స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది మార్చి 7. మార్చి 8 తేదిన నామినేషన్ల పరిశీలన, మార్చి 10 తేది వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు అని నోటిఫికేషన్‌  తెలిపింది. మార్చి 17వ తేదిన ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
కర్నాటక నుంచి రాజ్యసభకు  హేమామాలిని
బెంగళూరు: స్థానికేతర అభ్యర్థి అనే వివాదం నడుమ బాలీవుడ్ నటి హేమామాలిని కర్నాటక నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. రాజ్యసభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతిపక్షాలు ప్రఖ్యాత కన్నడ రచయిత మరులసిద్దప్పను రంగంలోకి దించాయి. కర్నాటకలో మార్చి మూడో తేదిన మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగునున్నాయి. కర్నాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానానికి హేమామాలిని నామినేషన్ వేసిన కొద్ది సేపటికే వ్యూహాత్మకంగా కాంగ్రెస్, జేడీఎస్‌లు మరులసిద్దప్పను రంగంలోకి దించడంతో  కర్నాటకలో రాజ్యసభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...