సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ ఏర్పాటుకు కేంద్రo గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 21వ తేదీ నుంచి  ప్రారంభంకానున్నాయి.  24వ తేదీన రైల్వే  బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి మమతా బెనర్జీ లోక్‌సభలో ప్రవేశపెడతారు. సాధారణ బడ్జెట్‌ను 28వ తేదీన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెడతారు.  ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  సాఫీగా జరిగేందుకు వీలుగ  2జీ స్పెక్ట్రమ్‌పై జేపీసీ ఏర్పాటుకు ఏకాభిప్రాయం కుదిరింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న  ప్రధాని - సభ ప్రశాంతంగా జరగాలని  మన్మోహన్ సింగ్ విపక్షాలను కోరారు. జేపీసీ గొడవతో గత సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు