ప్రపంచకప్లో భారత్ శుభారంభం: బంగ్లా పై భారీ విజయం
ఢాకా,ఫిబ్రవరి 19: టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ప్రపంచకప్లో శుభారంభం చేసింది. బంగ్లాదేష్ పై 87 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 14 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 140 బంతుల్లో 175 పరుగులు చేశాడు. సెహ్వాగ్ తో పాటు పోటాపోటీగా ఆడిన కోహ్లి ప్రపంచకప్లో ఆడుతున్న తొలిమ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 83 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. 371 పరుగుల భారీలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. మునాఫ్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ రెండు, హర్భజన్ సింగ్, యుసఫ్ పఠాన్ల తలో వికెట్ తీసుకున్నారు.

Comments