Tuesday, February 22, 2011

కలెక్టర్ వినీల్ కృష్ణ విడుదల

భువనేశ్వర్ , ఫిబ్రవరి 22:  మల్కన్'గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణని మావోయిస్టులు వదిలిపెట్టారు. కృష్ణ విడుదల కోసం మధ్యవర్తులు జరిపిన చర్చలు ఫలించాయి. మావోయిస్టుల 14 డిమాండ్లను పరిష్కరించేందుకు ఒడిషా ప్రభుత్వం అంగీకరించింది. ప్రొఫెసర్లు హరగోపాల్, సోమేశ్వరరావు  మావోయిస్టులతో మధ్యవ ర్తిత్వం నెరిపారు.  మావోయిస్టు ఖైదీ గంటి ప్రసాద్ బెయిలు పొందే విషయంలో జాప్యం జరగడంతో కృష్ణ విడుదల ఆలస్యం అయింది. గోవింద్ పల్లి అడవుల్లో కోహిలిపుట్ ప్రాంతంలో కృష్ణను, ఇంజనీర్లను మావోయిస్టులు వదిలిపెట్టడంతో  వారిని తీసుకువచ్చేందుకు  ప్రభుత్వ అధికారులు బయలుదేరి వెళ్ళారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...