Wednesday, February 16, 2011

ఇక బాబుతో అమీతుమీకి నాగం సిద్ధం...!

హైదరాబాద్ ,ఫిబ్రవరి 16: తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందంటూ  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగు ల మహా ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ అంశం విషయంలో టిడిపి రెండుగా చీలిపోయిందని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ టిడిపి ఫోరం కట్టుబడి ఉందని చెప్పారు. టిడిపి తెలంగాణ నేతలు అందరూ తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. తెలంగాణ టిడిపిలో ఎవరైనా ద్రోహులు ఉంటే వారి పని పడతామని  హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేకి అయిన గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అడ్డుకుంటామని నాగం స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదన్నారు. ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా  ఆయన పరోక్షంగా చంద్రబాబు నుద్దేశించి  అన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సర్కారుకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయాని అన్నారు.   తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానిని, కేంద్రాన్ని తెలంగాణకు ఒప్పించిన తర్వాతే హైదరాబాద్ తిరిగి రావాలన్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరితో నాగం జనార్దన్ రెడ్డి పూర్తిగా విసిగిపోయి ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...