రాజకీయాలకు నరేష్ గుడ్‌బై

చిత్తూరు,ఫిబ్రవరి 16:  రాజకీయాలకు తాను స్వస్తి  చెప్పానని, ఇకనుంచి సేవా కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తానని సినీనటుడు, బీజేవైఎం రాష్ట్ర మాజీ నాయకుడు నరేష్ వెల్లడించారు. బుధవారం ఆయన పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో సతీసమేతంగా విలేకరులతో మాట్లాడారు. పార్టీలకతీతంగా సేవ చేసేందుకు ‘ఐడియా’ స్వచ్ఛం ద సంస్థను ఏర్పాటు చేశానని, దీనిద్వారా రాయలసీమలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడతానన్నారు. భగవాన్ సత్యసాయిబాబా చేపట్టిన సేవాకార్యక్రమాలకు స్పందించి, ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెరర్ స్ఫూర్తిగా ఈ   నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాయలసీమ చరిత్ర, వాతావరణం, ఇక్కడి ప్రజల అభిమానం తనను కట్టిపడేశాయన్నారు. అనంతపురం జిల్లా మడకశిర నివాసి, మంత్రి రఘువీరారెడ్డి సోదరుని కుమార్తె రమ్యను తాను ప్రేమవివాహం చేసుకున్నానని, ఆమెకూడా సేవాదృక్పథం కలిగి ఉండడంతో ఐడియా సేవాసంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు