సామర్లకోట పవర్ ప్లాంటుకు అమెరికన్ జనరల్ ఎలక్ట్రిక్ టర్బైన్లు

న్యూయార్క్ ,జనవరి 23:    తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో అనిల్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన పవర్ ప్లాంటుకు అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) టర్బైన్లను సరఫరా చేసేందుకు  ఒప్పందం కుదిరింది. తద్వారా యూఎస్‌లో 1,600 ఉద్యోగాల కల్పన జరగనుంది.  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  న్యూయార్క్ సమీపాన షెనెక్టాడీలో ఉన్న జీఈ ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. ‘మీలో చాలా మంది సామర్లకోట గురించి విని ఉండరు. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే.. అక్కడి విద్యుత్ ప్లాంటుకే మీరు యంత్రాలు విక్రయించనున్నారు’ అని అమెరికన్లకు ఒబామా చెప్పారు. అడాగ్-జీఈ డీల్ వల్లే అమెరికాలో 1,200 తయారీ రంగ ఉద్యోగాలు, 400కు పైగా ఇంజినీరింగ్ ఉద్యోగాల కల్పన సాధ్యపడుతోందన్నారు. ఎగుమతుల ప్రాధాన్యానికి ఇది చక్కని ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు