Tuesday, January 25, 2011

రాష్ట్రానికి ' పద్మ ' వికాసం

న్యూఢిల్లీ,జనవరి 25:   2010 పద్మ పురస్కారాలకు 128 మందిని ఎంపిక చేశారు. వీరిలో 31 మంది మహిళలు ఉన్నారు. 13 మందికి పద్మ విభూషణ్ అవార్డులు, 31 మందికి పద్మభూషణ్, 84 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డులకు ఎంపికైన వారిలో ఆంధ్రప్రదేశ్'కు చెందినవారు  ఎక్కువమంది ఉన్నారు. పద్మవిభూషణ్ పొందినవారిలో  అక్కినేని నాగేశ్వరరావు, పల్లె రామారావు, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, చందాకోచ్చర్, కపిల వాత్సాయన, అజీమ్ ప్రేమ్'జీ, పద్మభూషణ్ పొందివారిలో  డాక్టర్ కె.అంజిరెడ్డి, డాక్టర్ జివికె రెడ్డి, వహిదా రెహ్మాన్, ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, శశికపూర్, ఖయ్యూమ్, వైసి దేవేశ్వర్. తమిళనాడులో కేటగిరిలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఈ అవార్డు ఇచ్చారు. పద్మశ్రీ పొందినవారిలో  కోనేరు రామకృష్ణారావు, పుల్లెల శ్రీరామ చంద్రుడు, వివిఎస్ లక్ష్మణ్, జి.గోవర్ధన్, సిద్దిఖ్, టబు, కాజోల్, ఇర్ఫాన్ ఖాన్, ఉషాఊతప్ప, గగన్ నారంగ్, సుశీల్ కుమార్, నారాయణ్ సింగ్ భాటి ఉన్నారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...