Monday, January 31, 2011

కెసిఆర్‌ ' సిగ్గు మాలిన ' వ్యాఖ్యలపై కేసు

న్యూఢిల్లీ,జనవరి 31:  తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల సీమాంధ్ర ప్రజలపై చేసిన  వ్యాఖ్యలపై అడుసుమిల్లి జయప్రకాశ్ సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీమాంధ్రులకు సిగ్గు లేదన్న వ్యాఖ్యలపై ఆయన పిటిషన్ వేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. చట్ట వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనను శిక్షించాలన్నారు. కాగా కృష్ణా జిల్లాలో మరో న్యాయవాది కెసిఆర్‌పై మచిలీపట్టణం కోర్టులో కేసు వేశారు.   ఆయనపై 503ఏ, 503బి, 506 తదితర సెక్షన్‌లపై కేసు వేసినట్టుగా తెలుస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...