రాంచి,జనవరి 28: జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఎన్కౌంటర్లో ఓ సబ్ జోనల్ కమాండర్ సహా తొమ్మిది మంది నక్సల్స్ మృతి చెందారు. లుహూర్ అటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల సంయుక్త బృందం అక్కడికి వెళ్ళడంతో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో తొమ్మిది మంది నక్సల్స్ మృతి చెందారని, మృతదేహాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతుల్లో ఒకరిని సబ్ జోనల్ కమాండర్ బసంత్ యాదవ్గా గుర్తించామని చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఆరు రైఫిళ్లు, మూడు నాటు తుపాకులు, రూ. 2,800 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment