వాషింగ్టన్ ,,జనవరి 25: సిలికాన్ వ్యాలీలోని ఓ వర్సిటీ చేసిన అక్రమాల కారణంగా అందులో చదువుకుంటున్న వందలాది మంది భారతీయుల విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. అమెరికా అధికారులు వీరిని బలవంతంగా స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం ప్లీజంటన్ పట్టణంలోని ట్రై-వ్యాలీ యూనివ ర్సిటీ వలస నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంది. దీంతో ఇమ్మిగ్రేషన్- కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత వారంలో వర్సిటీపై దాడి చేసి, దాన్ని మూసేశారు. ఐసీఈ వెల్లడించిన వివరాల ప్రకారం.. వర్సిటీలో మొత్తం 1,555 మంది విద్యార్థులున్నారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే. రెసిడెన్షియల్, ఆన్లైన్ కోర్సులు చదువుతున్న వీరిలో కొంతమంది కాలిఫోర్నియాలో నివసిస్తున్నట్లు రికార్డుల్లో ఉన్నా నిజానికి వీరు మేరీలాండ్, పెన్సిల్వేనియా, టెక్సాస్లలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వర్సిటీ అధికారులు వీసా పర్మిట్లను ఉల్లంఘించి విదేశీ విద్యార్థులకు వలస హోదా పొందడానికి కావలసిన పత్రాలు ఇచ్చారు. వర్సిటీ కేవలం 30 మంది విద్యార్థులకు మాత్రమే వలస వీసాలు ఇవ్వాల్సి ఉండగా, గత ఏడాదిలో ఏకంగా 939 మందికి వీటిని ఇచ్చింది. వర్సిటీని మూసేయడంతో భారత విద్యార్థులు న్యాయ సహాయం కోరుతూ లా సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment