రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు 70 కిలోమీటర్లు...
హైదరాబాద్,జనవరి 28: హైదరాబాద్: తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పోలవరం సాధన కోసం జగన్ ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. తొలి రోజు ఫిబ్రవరి 7వ తేదీన జగన్ తన యాత్రను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభించి ఆత్రేయపురం, బొబ్బర్లంక మీదుగా కాటన్ బ్యారేజి చేరుకుంటారు. రెండవ రోజు ఫిబ్రవరి 8వ తేదీన జగన్ పాదయాత్ర కాటన్ బ్యారేజి వద్ద ప్రారంభమై కొవ్వూరు మీదుగా వేగేశ్వరపురం చేరుకుంటుంది. రాత్రి వేగేశ్వరంలో ఆయన బస చేస్తారు. మూడోరోజు ఫిబ్రవరి 9 వేగేశ్వరపురంలో ప్రారంభమై పోలవరం చేరుకుంటుంది. 9వ తేదీ సాయంత్రం పోలవరంలో బహిరంగ సభ జరుగుతుంది.
హైదరాబాద్,జనవరి 28: హైదరాబాద్: తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పోలవరం సాధన కోసం జగన్ ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. తొలి రోజు ఫిబ్రవరి 7వ తేదీన జగన్ తన యాత్రను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభించి ఆత్రేయపురం, బొబ్బర్లంక మీదుగా కాటన్ బ్యారేజి చేరుకుంటారు. రెండవ రోజు ఫిబ్రవరి 8వ తేదీన జగన్ పాదయాత్ర కాటన్ బ్యారేజి వద్ద ప్రారంభమై కొవ్వూరు మీదుగా వేగేశ్వరపురం చేరుకుంటుంది. రాత్రి వేగేశ్వరంలో ఆయన బస చేస్తారు. మూడోరోజు ఫిబ్రవరి 9 వేగేశ్వరపురంలో ప్రారంభమై పోలవరం చేరుకుంటుంది. 9వ తేదీ సాయంత్రం పోలవరంలో బహిరంగ సభ జరుగుతుంది.
No comments:
Post a Comment