ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేశ్ ?

హైదరాబాద్,జనవరి  31: తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం ఊపందుకుంది.  ఇప్పటి వరకు ఆయన తెర వెనకే ఉంటూ వచ్చారు. ఇక ముందు తండ్రి వారసునిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆదివారం నాటి అవినీతి వ్యతిరేక ర్యాలీలో లోకేష్ ఆద్యంతం చురుగ్గా పాల్గొనడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఈ ర్యాలీ రాజకీయాలకు అతీతమని చంద్రబాబు  ప్రకటించినప్పటికీ,  గతం లో ఇలాంటి ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనని లోకేష్ ఆదివారం తెరముందుకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. లోకేష్ కొద్ది కాలంగా హెరిటేజ్ బాధ్యతలకే పరిమితమవుతూ వచ్చారు. తన తండ్రి నియోజకవర్గమైన కుప్పం వ్యవహారాలను మాత్రం అప్పుడప్పుడు పట్టించుకునేవారు.ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణుల సమన్వయానికే ఆయన పాత్ర పరిమితమయ్యేది. రైతు సమస్యల పరిష్కారానికి కొద్దిరోజుల కిందట చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష వేదికపై లోకేష్ బహిరంగంగా కనిపించారు. తండ్రి అరెస్టును తీవ్రంగా ప్రతిఘటించారు. అంతకుమించి రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు