హైదరాబాద్,జనవరి 31: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటి వరకు ఆయన తెర వెనకే ఉంటూ వచ్చారు. ఇక ముందు తండ్రి వారసునిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆదివారం నాటి అవినీతి వ్యతిరేక ర్యాలీలో లోకేష్ ఆద్యంతం చురుగ్గా పాల్గొనడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఈ ర్యాలీ రాజకీయాలకు అతీతమని చంద్రబాబు ప్రకటించినప్పటికీ, గతం లో ఇలాంటి ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనని లోకేష్ ఆదివారం తెరముందుకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. లోకేష్ కొద్ది కాలంగా హెరిటేజ్ బాధ్యతలకే పరిమితమవుతూ వచ్చారు. తన తండ్రి నియోజకవర్గమైన కుప్పం వ్యవహారాలను మాత్రం అప్పుడప్పుడు పట్టించుకునేవారు.ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణుల సమన్వయానికే ఆయన పాత్ర పరిమితమయ్యేది. రైతు సమస్యల పరిష్కారానికి కొద్దిరోజుల కిందట చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష వేదికపై లోకేష్ బహిరంగంగా కనిపించారు. తండ్రి అరెస్టును తీవ్రంగా ప్రతిఘటించారు. అంతకుమించి రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment