మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ యూసుఫ్ పఠాన్ |
కేప్టౌన్,జనవరి 18: మూడో వన్డేలో కూడా భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ దక్షిణాఫ్రికాపై రెండు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌట్ అయింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన జహీర్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా, మునాఫ్ పటేల్, ఆశిష్ నెహ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో సారథి స్మిత్ 43, డుమిని 52, ప్లెసిస్ 60 పరుగులు చేశారు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ చెప్పుకోదగినట్లు ఆడకపోవడంతో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తు కష్టాల్లో పడింది. ఓపెనర్ మురళీ విజయ్ 1,విరాట్ కోహ్లి 28, రోహిత్ శర్మ 23,యువరాజ్ సింగ్ 16, మహేంద్రసింగ్ ధోనీ 5 పరుగలు చేసి అవుటయ్యారు.ఈ దశలో యూసుఫ్ పఠాన్, సురేష్ రైనాలు చక్కగా ఆడి జట్టును ఆదుకున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడిన యుసఫ్ జట్టు స్కోరును పరుగులెత్తించాడు. మూడు భారీ సిక్స్ లు, ఆరు ఫోర్లతో 50 బంతుల్లో 59 పరుగులు చేశాడు. మరోవైపు నాలుగు ఫోర్లతో 37 పరుగులు చేసిన రైనా మోర్కెల్ బౌలింగ్లో డివిలీయర్స్కు చిక్కాడు. ఆ వెంటనే యుసఫ్ కూడా అవుటవ్వడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పటికీ జట్టు స్కోరు ఏడు వికెట్లకు 182 పరుగులు. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన హర్ భజన్ రెన్డు భారీ సిక్సర్లతో 23 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జహీర్ ఖాన్(14), నెహ్రా(6)ల సాయంతో జట్టు విజయానికి కావాల్సిన పరుగులను సాధించాడు. ఆఖరికి ఫోరు కొట్టి నెహ్రా జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఐదు వన్డేల సీరిస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. యుసఫ్ పఠాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
No comments:
Post a Comment