Thursday, January 27, 2011

నిత్యానంద ఆశ్రమంలో రంజితకు ప్రధాన శిష్యురాలి హోదా!

చెన్నై,జనవరి 27 : ప్రముఖ నటి రంజితతో లైంగిక చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆమెకు తన ఆశ్రమంలో ప్రధాన శిష్యురాలి హోదాను కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గురువారం ఓ తమిళ పత్రిక వెల్లడించింది. ఈ విషయాన్ని త్వరలో ఆయనే స్వయంగా ప్రకటించనున్నట్టు పేర్కొంది. నిత్యానంద, రంజితల పడక గది దృశ్యాల సీడీలు వెలుగులోకి రావడంతో గత ఏడాది వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక సీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న రంజిత నెలరోజుల క్రితం బయటకు వచ్చారు. సీఐడీ విచారణకు హాజరైన ఆమె ఆ సీడీలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. మార్ఫింగ్ చేసిన సీడీతో తన పేరుకు కళంకం తెచ్చే రీతిలో కుట్ర పన్నిన లెనిన్ కరుప్పన్‌ను చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రకటించారు.ఈ వ్యవహారం కారణంగా నిత్యానందకు రంజిత కాస్త దూరంగానే ఉంటారని అందరూ భావించారు. అయితే నిత్యానంద జన్మదిన వేడుకల్లో పాదపూజ చేస్తూ రంజిత కనిపించడం, రెండు రోజుల క్రితం బెంగళూ రు ఆశ్రమంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...