Friday, January 21, 2011

తెలంగాణ తెదేపా నేతల్లో విభేదాలు!

హైదరాబాద్,జనవరి 21: తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు కనబడుతోంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌పై నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. తమ ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు పార్టీ అధినేతను బ్లాక్‌మెయిల్ చేసేలా ప్రవర్తిస్తున్నారని నర్సింహులు ఆరోపించారు. వారు తెలంగాణ రాష్ట్ర సాధన కంటే నాయకత్వం కోసం వెంపర్లాడుతున్నట్టుగా ఉందని నర్సింహులు అన్నారు. ఇది పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు హాని కలిగిస్తుందన్నారు. అప్పుడే  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్టు, తెలంగాణకు తామే నాయకత్వం వహించనున్నట్టు కొంతమంది కలలుగంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడూ వ్యతిరేకించ లేదన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చంద్రబాబే స్వయంగా ఆ ప్రాంత కమిటీని ఏర్పాటు చేసి, ఒకరికి నాయకత్వ బాధ్యతలు తప్పకుండా అప్పగిస్తారని మోత్కుపల్లి అన్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...