హైదరాబాద్,జనవరి 30: రాష్ట్ర సమాచార శాఖా మంత్రి డీకే అరుణ హత్యకు కుట్ర జరిగింది. మంత్రి వెళ్లే దారిలో దుండగులు డిటోనేటర్లు అమర్చారు. అయితే మంత్రి సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మంత్రి డీకే అరుణకు కాల్ వచ్చింది. మహబూబ్నగర్ ఐజా వద్ద మిమ్మల్ని టార్గెట్ చేస్తారంటూ మంత్రి అరుణకు బెదిరింపు కాల్ రావడంతో మంత్రి వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంత్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఐజా వద్ద శనివారం రాత్రి పేలుడు పదార్థాలను గుర్తించి బాంబ్ స్క్వాడ్ తొలగించింది. అనంతరం జరిపిన విచారణలో కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి నుంచి కాయిన్ బాక్స్ ద్వారా మంత్రికి ఫోన్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా దుండగులు అమర్చిన పేలుడు పదార్థాలతో ప్రమాదం లేదని ఎస్పీ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment