' కిక్కు ' మరింత ప్రియం !

హైదరాబాద్,జనవరి 31: ఎక్సైజ్ సుంకం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీర్లు, దేశీయ మద్యంపై  సుంకం పెంచింది.దేశంలో తయారయ్యే చీఫ్ లిక్కర్'పై కూడా సుంకాన్ని పెంచారు. ఛీప్ లిక్కర్ క్వార్టర్ మూడు రూపాయల నుంచి అయిదు రూపాయలు, బీరు బాటిల్ అయిదు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు పెరగనున్నాయి. ఈ సుంకం పెంచినందున ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు