Thursday, January 27, 2011

ఒబామా ప్రభుత్వంలో మరో ఇద్దరు భారతీయులు

వాషింగ్టన్,జనవరి 27:  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతన ప్రభుత్వంలోని కీలక పదవుల్లో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లను నియమించారు. ‘ప్రివెన్షన్, హెల్త్ ప్రమోషన్ అండ్ ఇంటిగ్రేటివ్ అండ్ పబ్లిక్ హెల్త్’ సలహా సంఘ సభ్యుడిగా వివేక్ మూర్తి అనే ప్రఖ్యాత డాక్టర్‌ను నియమించారు. ప్రభుత్వం తరఫున వాణిజ్య చర్చల్లో పాల్గొనే బృందంలో ప్రధాన వ్యవసాయ రంగ ప్రతినిధి(చీఫ్ అగ్రికల్చరల్ నెగోషియేటర్)గా ఇస్లామ్ ఏ సిద్దిఖీ అనే వ్యవసాయ శాస్తవ్రేత్తను ఒబామా పునర్నియమించారు. ‘వారు తమ నైపుణ్యం, అనుభవాలతో మన దేశానికి ఎంతో సేవచేశారు.. వారితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా ఒబామా పేర్కొన్నారు. డాక్టర్ వివేక్‌మూర్తి హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. 15 వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు సభ్యులుగా ఉన్న ‘డాక్టర్స్ ఫర్ అమెరికా’ సంస్థ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికాలో మెరుగైన వైద్యారోగ్య వ్యవస్థ రూపకల్పన కోసం ఆ సంస్థ కృషి చేస్తోంది. చీఫ్ అగ్రికల్చరల్ నెగోషియేటర్ పదవితో సిద్దిఖీకి అంబాసిడర్ హోదా లభిస్తుంది.  ఉత్తరాఖండ్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సిద్దిఖీ చదువుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...